వన్డేల్లో విరాట్ సెంచరీ

వన్డేల్లో విరాట్ సెంచరీ

దుబాయ్‌‌‌‌: ఇండియా స్టార్‌‌ బ్యాటర్‌‌ విరాట్‌‌ కోహ్లీ (707).. ఐసీసీ వన్డే ర్యాంక్‌‌ను మెరుగు పర్చుకున్నాడు. బుధవారం రిలీజ్‌‌ చేసిన తాజా జాబితాలో కోహ్లీ రెండు ప్లేస్‌‌లు ఎగబాకి 8వ ర్యాంక్‌‌లో నిలిచాడు. దాదాపు మూడేళ్ల తర్వాత వన్డేల్లో విరాట్ సెంచరీ చేయడం ర్యాంక్‌‌ మెరుగుపడటానికి దోహదపడింది. ఇక డబుల్‌‌ సెంచరీతో చెలరేగిన ఇషాన్‌‌ కిషన్‌‌ (578).. 117 స్థానాలు మెరుగుపడి 37వ ర్యాంక్‌‌లోకి దూసుకొచ్చాడు.

శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (663) 15వ ర్యాంక్‌‌కు పడగా.. కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ (705) రెండు ప్లేస్‌‌లు దిగజారి 9వ ర్యాంక్‌‌లో నిలిచాడు. శిఖర్‌‌ ధవన్‌‌ (635).. 22వ ర్యాంక్‌‌లో ఉన్నాడు. బౌలర్లలో హైదరాబాదీ మహ్మద్‌‌ సిరాజ్‌‌ (568) నాలుగు ప్లేస్‌‌లు ఎగబాకి 22వ ర్యాంక్‌‌లో నిలిచాడు. బుమ్రా (605).. 18వ ర్యాంక్‌‌కు పడిపోయాడు.