సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా నటించిన సినిమా ‘విరూపాక్ష’. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. అయితే విరూపాక్ష ఈ చిత్ర టీజర్ ఇవాళ విడుదల కావాల్సి ఉండగా...వాయిదా పడింది. సాయిధరమ్ తేజ భీమవరం అభిమాన సంఘం అధ్యక్షుడు రావూరి పండు (28) నిన్న క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. పండు మృతితో కలత చెందిన సాయిధరమ్ తేజ్ ..విరూపాక్ష టీజర్ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. టీజర్ విడుదల ఎప్పడనేది త్వరలో తెలియజేస్తామని చిత్రబృందం తెలిపింది.
విరూపాక్ష సినిమాను ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించింది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ప్లే అందించారు. మలయాళ భామ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. విరూపాక్ష మూవీని ఏప్రిల్ 21న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ చిత్రం టీజర్ను ప్రత్యేకంగా వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..సినిమాను మెచ్చుకోవడంతో ‘విరూపాక్ష’పై అంచనాలు పెరిగిపోయాయి.