బేబీ మూవీ తరహాలో విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ

బేబీ మూవీ తరహాలో విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ

ఈ తరం యువతీయువకుల్లో చాలా మంది ఈజీగా ప్రేమలో పడుతున్నారు. అయితే ఆ ప్రేమ ఒకరికి మాత్రమే పంచడం లేదు. ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్‌లో ఉంటూ చివరికి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదే కాన్సెప్ట్‌తో ఇటీవల తెరకెక్కిన సినిమా బేబీ. ప్రస్తుతం జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సాయి రాజేష్‌. సరిగ్గా అలాంటిదే కథే  విశాఖలో జరగగా ఈ ఘటన విషాదంతంగా ముగిసింది.  

విశాఖ జిల్లాలో యువతి ఇద్దరు అబ్బాయిలతో ఒకేసారి సాగించిన ప్రేమాయణంలో మరో ట్విస్ట్ బయటపడింది. బేబీ మూవీ సీన్ రిపీటయ్యింది. ఇద్దరు యువకులను ఒకేసారి ప్రేమించిన యువతి.. మరో వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుంది.  పెళ్లయ్యాక కూడా ప్రియుడితో ప్రేమాయణం సాగించింది. అనుమానం వచ్చిన భర్త నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. భర్త, ప్రియుడు.. ఎవరు కావాలో తేల్చుకోవాలని గొడవ చేయడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె చనిపోయిందని తెలుసుకున్న ప్రియుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. బేబీ మూవీలో బేబీ కథా సుఖాంతం అయింది. కానీ విశాఖ ఘటనలో యువతి కథ విషాదాంతం అయింది. 

విశాఖకు చెందిన యువతి ఇంటర్ చదువుతోంది. ఆ యువతి ఒకేసారి సాయికుమార్, సూర్య ప్రకాశ్ అనే ఇద్దరు యువకులతో ప్రేమాయణం సాగించింది. సాయికుమార్ తో రహస్యంగా తాళి కట్టించుకుంది. పెళ్లయ్యాక కూడా సూర్య ప్రకాశ్ తో చనువుగా ఉంటోంది. దీంతో అనుమానం వచ్చిన సాయి యువతిని నిలదీయగా అసలు విషయం చెప్పింది. మాలో ఎవరు నీకు కావాలో తేల్చుకో అంటూ సాయికుమార్, స్యూర్య ప్రకాష్ ఇద్దరు ఆ యువతికి లెటర్ రాయటంతో ఆ యువతి 2023 ఆగస్టు 10న ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో సూర్య ప్రకాశ్, సాయికుమార్ పై యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
యువతి సూసైడ్ చేసుకున్న రోజే ప్రియుడు సూర్య ప్రకాశ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.  విషయం తెలుసుకున్న పోలీసులు సూర్య ప్రకాశ్ మృతదేహాన్ని రైలు పట్టాలపై స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ కేసులు సాయికుమార్ అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.