Ratnam Trailer: రక్తపాతంతో విశాల్ రత్నం ట్రైలర్..ప్రేమ కోసం యాక్షన్ ప్యాక్డ్‌ అదిరిపోయింది

Ratnam Trailer: రక్తపాతంతో విశాల్ రత్నం ట్రైలర్..ప్రేమ కోసం యాక్షన్ ప్యాక్డ్‌ అదిరిపోయింది

విశాల్ హీరోగా ‘సింగం’ ఫేమ్ హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రత్నం’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో నుంచి వచ్చిన మాస్ బ్లక్ బ్లాస్టర్స్ భరణి, పూజ చెప్పాల్సిన పనిలేదు. ఓ రేంజ్ లో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రాబోయే రత్నం మూవీపై కూడా భారీ అంచనాలు వున్నాయి.

తాజాగా ఈ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు బోర్డర్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అయితే తెలుగు, తమిళనాడు స్టేట్స్ విడిపోయిన తరువాత బోర్డర్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు..అటు ఇటు సమానంగా వెళ్లిపోయాయి అని అందరికి తెలిసిందే.

ఈక్రమంలోనే తిరుపతి ఆంధ్రాకి వచ్చి చేరింది. అయితే ఇక్కడ చాలామంది తమిళియన్స్..తిరుపతి తమదే అంటూ ఇప్పటికి తమ వాదనలు వినిపిస్తూ వస్తున్నారు.సరిగ్గా ఇప్పుడు ఆ గొడవ నేపథ్యంతోనే రత్నం సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ ని బట్టి అర్ధమవుతుంది.

ఇక ఈ స్టోరీ నడుస్తున్నదంతా హీరోయిన్ ప్రియా భవాని శంకర్ చుట్టూ అన్నట్టు తెలుస్తోంది.అందులో భాగంగా హీరోయిన్ ని వెంటాడడం "ఆ అమ్మాయి నా ప్రాణం..నా ఊపిరి" అని విశాల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా సాగింది. ఈ చిత్రంలో గౌతమ్ మీనన్,  సముద్రఖని, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టోన్ బెంచ్‌‌ ఫిలిమ్స్‌‌, జీ స్టూడియోస్‌‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.ఈ మూవీ ఏప్రిల్ 26న థియేటర్లో రిలీజ్ కానుంది.