
యాక్షన్ హీరో విశాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈనెల 26న ‘సామాన్యుడు’గా ప్రేక్షకుల ముందుకు రానున్న విశాల్ ప్రస్తుతం లాఠీ, డిటెక్టివ్2 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి సెట్స్పై ఉండగానే మరో మూవీకి ముహూర్తం పెట్టేశాడు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో తన 33వ మూవీ టైటిల్ను నిన్న అనౌన్స్ చేస్తూ షూటింగ్ అప్డేట్ ప్రకటించాడు.
‘మార్క్ ఆంటోనీ’ టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను వచ్చే నెల నుంచి మొదలుపెట్టనున్నట్టు విశాల్ చెప్పాడు. ఇందులో అతడు సరికొత్త గెటప్లో కనిపించనున్నాడు. ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. విశాల్ గత సినిమాల మాదిరిగానే ఇది కూడా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నట్టు నిర్మాత ఎస్ వినోద్ కుమార్ తెలిపారు. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు.