ముహూర్తం మారింది

ముహూర్తం మారింది

విశ్వక్‌‌‌‌సేన్ హీరోగా ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ అనే సినిమా తెరకెక్కింది. చింత విద్యాసాగర్ దర్శకుడు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ రకరకాల కారణాలతో పలుమార్లు వాయిదా పడి, చివరికి ఏప్రిల్ 22కు ముహూర్తం కుదిరింది. కానీ ఈ డేట్‌‌‌‌కి కూడా రావడం లేదంటూ నిన్న ప్రకటించారు. ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వయసు మీద పడుతున్నా పెళ్లి అవ్వక ఇబ్బందిపడే కుర్రాడిగా విశ్వక్ నటించాడు. ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌, ఫుల్ ఫన్ ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.