
చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి రూపొందిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ ప్రాజెక్టును నిర్మాత విక్రమ్ రెడ్డి ఇంటర్నేషనల్ లెవల్కి తీసుకెళ్లారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విశ్వంభర ఎక్స్క్లూజివ్ బుక్ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్లో ఆయన సినిమా కథ, భారతీయ పురాణాల ప్రాధాన్యత, బుక్ విశేషాలు గురించి వివరించారు. అలాగే సినిమా స్థాయి, వీఎఫ్ఎక్స్ స్టూడియోల సహకారం గురించి కూడా చెప్పారు. సోషియో ఫాంటసీ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, సాంగ్ ఇతర ప్రమోషనల్ కంటెంట్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు ఇప్పటికే తొంభై శాతం పూర్తయ్యాయని, త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామని అన్నారు. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రంలో కునాల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.