సీఎం కేసీఆర్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు

సీఎం కేసీఆర్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు

తెలంగాణ నిధులను కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారన్నారు బీజీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లాలో బైక్ ప్రమాదంలో గాయపడిన బీజేపీ నేత వెంకటేశ్వర్లు గౌడ్ ను ఆయన పరామర్శించారు.  లంబాడిపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం నిర్మాణానికి లక్ష రూపాయిల చెక్కును విరాళం అందజేశారు.  రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పరామర్శకు కూడా వెళ్లని కేసీఆర్ పంజాబ్ లో రైతులను పరామర్శించడానికి వెళ్లడం సిగ్గుచేటన్నారు వివేక్ వెంకటస్వామి. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు మూడు లక్షలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదు కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రజల డబ్బును వృథా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 

మరిన్ని వార్తల కోసం

మంకీపాక్స్ అంటే ఏమిటీ..ఈ వ్యాధి ఎలా సోకుతోంది..?

కానూన్ అప్నా అప్నా మూవీలో జస్టిస్ లావు నాగేశ్వరరావు