మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం 

మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం 

 సీఎం కేసీఆర్ ది తుగ్లక్ పాలన అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ,మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి అన్నారు. లిక్కర్ స్కాం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి  దేశ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ది ఓట్ల రాజకీయమే తప్ప... తెలంగాణకు ఆయన  చేసింది శూన్యమన్నారు. టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. 

గిరిజనుల ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ గిరిజన బంధును తెరపైకి తీసుకొచ్చారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మునుగోడులో గిరిజనుల ఓట్ల కోసం రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి  ఎన్నిరకాలుగా మభ్యపెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రధాని మోడీ దేశాభివృద్ధికి  అహర్నిశలు కృషి చేస్తుంటే టీఆర్ఎస్ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కాకుండా అవినీతిలో అగ్రగామిగా నిలిపారని సీఎం కేసీఆర్ ను విమర్శించారు. రైతులకు రుణ మాఫీ చేస్తానని నమ్మించి.... వారిని దారుణంగా మోసం చేశారని తెలిపారు. కేసీఆర్ తెలంగాణను తాగుబోతు రాష్టంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని వివేక్ వెంటకస్వామి ధీమా వ్యక్తం చేశారు.