కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేసిండు

కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేసిండు

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాక్షస పాలన జరుగుతుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. 18వ రోజు నారాయణపేటలో జరుగుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్రలో బండి సంజయ్ తో పాటు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. నారాయణపేట మండలం అంత్వార్ గేట్ నుంచి ప్రారంభమైన ఇవాల్టి పాదయాత్ర కొల్లంపల్లి, లింగంపల్లి గెట్, ధన్వాడ మీదుగా మణిపూర్ తండా వరకు సాగనుంది. కేసీఆర్ ది అవినీతి పాలనని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబమైందన్నారు. రైతులను కోటీశ్వరులను చేస్తానని బికారులుగా మార్చారంటూ ఫైర్ అయ్యారు. కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డిని మాత్రం కోటీశ్వరుడిని చేశారని విమర్శించారు వివేక్.  సీఎం కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేశారన్నారు.  ఆయుష్మాన్ భారత్ ను  కేంద్రం ప్రవేశ పెట్టినా తెలంగాణలో అమలు చేయడం లేదన్నారు.

భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర