మందమర్రిలో నీటి కష్టాలు లేకుండా చేశాం : వివేక్​ వెంకటస్వామి

మందమర్రిలో నీటి కష్టాలు లేకుండా చేశాం : వివేక్​ వెంకటస్వామి
  • డ్రైయినేజీ పనులకు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి భూమిపూజ

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు అప్పటి పెద్దపల్లి ఎంపీ కాకా వెంకటస్వామి రూ.24 కోట్లతో గోదావరి నుంచి తాగునీరు సప్లై చేసే శాశ్వత పథకాన్ని తీసుకొచ్చారని చెన్నూరు ఎమ్మెల్యే డా.వివేక్​ వెంకటస్వామి అన్నారు. గురువారం సాయంత్రం మందమర్రి పాత బస్టాండ్​ ఏరియాలో రూ.2.21 కోట్ల స్పెషల్​డెవలప్​మెంట్​ ఫండ్స్​తో చేపట్టనున్న డ్రైయినేజీ నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ ​యువ నాయకులు గడ్డం వంశీకృష్ణతో కలిసి భూమి పూజ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మందమర్రి మున్సిపాలిటీలోని వార్డులో తాగునీటి సమస్యలు తీర్చేందుకు విశాఖ ట్రస్ట్ ద్వారా వాటర్ ట్యాంక్, బోర్​వెల్స్​తో నీటిని సప్లై చేసి ప్రజల కష్టాలు తీర్చామని గుర్తుచేశారు. మిషన్​ భగీరథ ద్వారా నీళ్లు సరఫరా కాని ప్రాంతాల్లో బోర్​వెల్స్ ​వేసి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా డ్రైయినేజీ నిర్మాణానికి ఫండ్స్ మంజూరు చేయించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతులు సమర్పించారు. కార్యక్రమంలో మందమర్రి మున్సిపల్​కమిషనర్ ​వెంకటేశ్వర్లు, డీఈ సుమతి, ఏఈ అచ్యుత్, కాంగ్రెస్ ​లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో..

చెన్నూరు మండలం అక్కేపల్లి గ్రామంలోని మంతమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వివేక్, నల్లాల ఓదెలు, గడ్డం వంశీకృష్ణ ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. భీమారం మండల కేంద్రానికి చెందిన  కంకణాల సుధాకర్​ రెడ్డి కూతురు వివాహం జరిగిన నేపథ్యంలో వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు