
కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్.. తన కోసం, మెగా కృష్ణారెడ్డి కోసమే కట్టుకున్నాడన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాలలోని లక్షట్టిపేటలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు వివేక్ వెంకటస్వామి, ఈటెల రాజేందర్. పార్లమెంట్ ఎన్నికల్లో సారు... కారు... సర్కారు ఖతం అయ్యిందన్నారు. తన ఆస్తులను పెంచుకోవడం కోసమే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మార్చాలంటున్నాడన్నారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంను కేసీఆర్ వృథాగ ఖర్చు చేస్తున్నాడన్నారు. సింగరేణిని ప్రైవేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం కానీ ప్రధాని మోడీ ఎక్కడ చెప్పలేదన్నారు. కావాలనే టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందన్నారు.