అనాధ పిల్లలను సోషల్ చాలెంజ్ పర్సన్స్ గా గుర్తించాలి

అనాధ పిల్లలను సోషల్ చాలెంజ్ పర్సన్స్ గా గుర్తించాలి

అనాధ పిల్లలను సోషల్ చాలెంజ్ పర్సన్స్ గా గుర్తించాలన్నారు బీజేపీ కోర్ కమిటీ మెంబర్ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఢిల్లీలో వివేక్ ను అనాధ బాలల హక్కుల, సామాజిక సాధికారిక సంస్థ అధ్యక్షులు గాదె ఇన్నయ్య కలిశారు. అనాధ పిల్లలను ఆదుకోవడంలో ఇన్నయ్యది గొప్ప హృదయమన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అనాధ బాలల కోసం ఒక చట్టం తీసుకు రావాలని.. అనాధ బాలల పేరు తీసేసి... చట్టంలో ఒక ప్రత్యేక పేరు పెట్టాలన్నారు.  దేశంలో 4 కోట్ల మంది అనాధ బాలలు ఉన్నారని....వారి గుర్తింపు కల్పించాలన్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రిని కలిసి అనాధ హక్కుల కోసం తనవంతు కృషి చేస్తామన్నారు వివేక్.