బేగంపేటలో ఆటమ్ చార్జింగ్ స్టేషన్‌ని ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

బేగంపేటలో ఆటమ్ చార్జింగ్ స్టేషన్‌ని ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ బేగంపేటలో ఆటమ్ చార్జింగ్ స్టేషన్ ని ప్రారంభించారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, విశాక చైర్మన్ వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో విశాక మేనేజింగ్ డైరెక్టర్ సరోజ వివేక్, JMD వంశీకృష్ణ పాల్గొన్నారు. ఆటం చార్జ్ స్టేషన్ లో అన్ని రకాల వాహనాలు చార్జింగ్ చేసుకోవచ్చని చెప్పారు JMD వంశీకృష్ణ. ప్రపంచంలోనే ఇది మొదటి సోలార్ పవర్ స్టేషన్ అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ సర్వీస్ కూడా కల్పిస్తున్నామన్నారు.  ఫస్ట్ ఫేజ్ లో దేశ వ్యాప్తంగా 50 స్టేషన్స్ ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.