
పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని ఎల్లమ్మ, పోచమ్మ తల్లులను వేడుకున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో బుధవారం వివేక్ పర్యటించారు. ఈ సందర్భంగా జనగామలో జరుగుతన్న పోచమ్మ బోనాల్లో పాల్గొని పూజలు చేశారు. సుల్తానాబాద్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల్లో కూడా పూజలు చేసి ఆలయ అభివృద్ధికి రూ. 50 వేలు ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ లీడర్లు సాధుల రాంబాబు, మల్లికార్జున్, సునీల్కుమార్, విజయ్, సజ్జద్, కాడే సూర్యనారాయణ, ఎలిగేడు శ్రీనివాస్, పవన్, ఏగోలపు సదయ్య, నాగరాజు, శ్యాం, వెంకటేశ్ పాల్గొన్నారు.