మందమర్రి/జైపూర్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి గురువారం మందమర్రి యాపల్ ప్రాంతంలో గణేశ్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండప నిర్వాహకులు వివేక్ వెంకటస్వామిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి అందుగుల శ్రీనివాస్, మండప నిర్వహకులు ఐలయ్య, లీడర్లు గడ్డం శ్రీనివాస్, నగేశ్, సురేందర్, వినయ్, సురేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
యువత బీజేపీ వైపు చూస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనను ఇందారంలో బీజేపీ లీడర్లను కలిశారు. ఈ సందర్భంగా టేకుమట్ల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ బీజేపీలో చేరారు. కార్య క్రమంలో పార్టీ మండల ప్రెసిడెంట్ చల్ల విశ్వంబర్ రెడ్డి, లీడర్లు బల్ల వెంకటేశ్ ఉన్నారు.