ఫిలిప్పీన్స్‌లో పెద్దపల్లి విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఫిలిప్పీన్స్‌లో పెద్దపల్లి విద్యార్థిని అనుమానాస్పద మృతి

పెద్దపల్లి జిల్లాలోని యైటింక్లయిన్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి.  శ్రీనివాస్ కుమార్తె నాగ పూజిత  ఫిలిప్పిన్స్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తమ కుమార్తె ఎలా చనిపోయిందనే విషయంలో క్లారిటీ లేదని.. తమకుమార్తె మృతిపై అనుమానాలున్నాయని అంటున్నారు పేరెంట్స్. ఈ విషయం తెలుసుకుని నాగ పూజిత కుటుంబాన్ని పరామర్శించిన  వివేక్ వెంకటస్వామి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడారు. డెడ్ బాడీ తెప్పించేందుకు ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. 

యైటింక్లయిన్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు జనగామ నాగ శ్రీనివాస్ కుమార్తె నాగ పూజిత.. ఎంబీబీఎస్ చదివేందుకు 2017లో ఫిలిఫ్పిన్స్ వెళ్లింది. అక్కడ దావోస్ మెడికల్ ఫౌండేషన్ లో ఎంబీబీఎస్ చేస్తోంది. మరో మూడు నెలల్లో కోర్సు పూర్తి అవుతుందనగా నాగ పూజిత అనారోగ్యంతో చనిపోయిందని నిర్వాహకులు ఫోన్ లో తెలిపారు. వివేక్ వెంకటస్వామి చొరవతో తమ కుమార్తె డెడ్ బాడీ తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు పూజిత తండ్రి నాగ శ్రీనివాస్. తమ కుమార్తె మృతిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.