ఇండియాలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టూర్స్ షెడ్యూల్ రిలీజ్
న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో ఈ మధ్యే ఆస్ట్రేలియా–ఇండియా మధ్య టీ20 మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసిన అభిమానులు ఇప్పుడు మరో పోరు చూడొచ్చు. జనవరిలో న్యూజిలాండ్తో సిరీస్లో తొలి వన్డేను హైదరాబాద్కు కేటాయించింది. జనవరి 18న ఈ మ్యాచ్ జరగనుంది. మరోవైపు మార్చి 19న ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు జనవరి–మార్చి మధ్య మన దేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమ్స్ టూర్ల షెడ్యూల్ను బీసీసీఐ గురువారం రిలీజ్ చేసింది. తొలుత జనవరి 3 నుంచి 15 వరకు లంక.. ఇండియాతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్ (జనవరి 18-–ఫిబ్రవరి 1) మూడు వన్డేలు, మూడు టీ20ల్లో పోటీ పడనుంది. ఫిబ్రవరి 9–మార్చి 22 మధ్య ఆస్ట్రేలియా 4 టెస్టుల సిరీస్ తో పాటు మూడు వన్డేల సిరీస్లో ఇండియాను ఎదుర్కోనుంది.