పేకమేడలా కూలుతున్న వొడాఫోన్‌ ఐడియా షేర్లు

పేకమేడలా కూలుతున్న వొడాఫోన్‌ ఐడియా షేర్లు

వొడాఫోన్‌ ఐడియాకు భారీగా నష్టం వచ్చింది. గురువారం మరో  21.6 శాతం పతనమయ్యాయి. ఫలితంగా వొడాఫోన్‌ ఐడియాషేర్లు రూ. 2.90 కి పడిపోయాయి. ఫలితంగా  సెప్టెంబర్ త్రైమాసికంలో ఆ సంస్థ రూ. 50,921 కోట్ల నష్టం వచ్చిందని ప్రకటించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏజీఆర్‌‌ బకాయిలను మూడు నెలల్లోగా చెల్లించాలంటూ డిపార్ట్‌ మెంట్‌‌ ఆఫ్‌ టెలికం (డాట్‌‌) ఆపరేటర్లకు నోటీసులిచ్చింది. సెల్ఫ్‌ ఎసెస్‌ మెంట్‌‌ ప్రాతిపదికన బకాయిలను చెల్లించే ఆప్షన్‌ నూ డాట్‌‌ కల్పించింది. బకాయిలను డాట్‌‌కు మూడు నెలల్లో చెల్లించి, తమకుతెలియచేయాల్సిందిగా సుప్రీం కోర్టు గత నెలలో టెలికం కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది.