ఏప్రిల్ 3 నుంచి ఓటర్ చైతన్య కార్యక్రమాలు : వల్లూరు క్రాంతి

ఏప్రిల్ 3 నుంచి ఓటర్ చైతన్య కార్యక్రమాలు : వల్లూరు క్రాంతి
  •     జిల్లా ఎన్నికల అధికారి  క్రాంతి 

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఈ నెల 3 నుంచి 30 వరకు ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి తెలిపారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్​లో స్వీప్ కార్యక్రమాల నిర్వహణ పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్​మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు పనిచేయాలన్నారు.

ఈ నెల 3న అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువత కోసం 16న 2కే రన్ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, స్వీప్ నోడల్ అధికారి జగదీశ్ రెడ్డి, ఎన్నికల నోడల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.