
కొడంగల్, వెలుగు: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వికారాబాద్ జిల్లా అధికారులు పల్లె పోరుకు సమాయత్తమవుతున్నారు. గురువారం కొడంగల్లోని జడ్పీ హై స్కూల్లో బీఎల్ఓ, సూపర్వైజర్లకు ఎలక్షన్ ట్రైనింగ్ ప్రారంభించారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించాకే ఓటరు జాబితాలో మార్పు, చేర్పులు చేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ఆదేశించారు.
18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జాబితాలో తప్పుగా నమోదైన పేర్లు, పాత ఫొటోలను సవరించాలన్నారు. కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేలా జాబితాలో మార్పులు చేయాలని సూచించారు. తహసీల్దార్విజయ్కుమార్, ఎంఈఓ రాంరెడ్డి ఉన్నారు.