
మెహిదీపట్నం, వెలుగు: న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఈసీఐ అండర్ సెక్రటరీ అజయ్ కుమార్, సెక్షన్ అధికారి సందీప్ కుమార్ బుధవారం నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్ట్రోరల్ ఆఫీసులో ఓటరు నమోదు, ఎన్నికల ఏర్పాట్లపై పలు అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు, జెండర్ రేషియో, ఈపీ రేషియో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 92,227 రెండు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
సెకండ్ యస్యస్ఆర్లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో క్లేమ్స్, అబ్జెక్షన్, మార్పులు చేర్పులు, ఓటరు నమోదు పై స్వీప్ కార్యక్రమం స్పెషల్ క్యాంపెయిన్ చేపట్టిన చర్యల గురించి ఈఆర్వో వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్, ఈఆర్వో ఆంజనేయులు, ఆర్ఓ లావణ్య, ఎఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.