ఓటరు నమోదు వివరాల పరిశీలన

ఓటరు నమోదు వివరాల పరిశీలన

మెహిదీపట్నం, వెలుగు:   న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఈసీఐ అండర్ సెక్రటరీ అజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, సెక్షన్ అధికారి సందీప్ కుమార్  బుధవారం నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్ట్రోరల్​ ఆఫీసులో  ఓటరు నమోదు, ఎన్నికల ఏర్పాట్లపై పలు అంశాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  నియోజకవర్గంలో  మొత్తం ఓటర్లు,  జెండర్ రేషియో, ఈపీ రేషియో అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా 92,227  రెండు  పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. 

 సెకండ్ యస్‌‌‌‌యస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో  క్లేమ్స్, అబ్జెక్షన్, మార్పులు చేర్పులు, ఓటరు నమోదు పై స్వీప్ కార్యక్రమం స్పెషల్ క్యాంపెయిన్ చేపట్టిన చర్యల గురించి ఈఆర్​వో  వివరించారు.  కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్, ఈఆర్‌‌‌‌‌‌‌‌వో ఆంజనేయులు, ఆర్‌‌‌‌‌‌‌‌ఓ లావణ్య, ఎఈఆర్‌‌‌‌‌‌‌‌వోలు తదితరులు  పాల్గొన్నారు.