యూఎస్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీకి వైరస్

యూఎస్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీకి వైరస్

వాషింగ్టన్: యూఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీకి కరోనావైరస్ కన్ఫామ్ అయిందని వైట్ హౌస్ శనివారం తెలిపింది. దీంతో వైట్ హౌస్ కాంప్లెక్స్ లో కరోనా సోకిన వారి సంఖ్య రెండుకు చేరుకుంది. మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్న కేటీ మిల్లర్ కు కరోనా సోకినట్లు తాజా టెస్టుల్లో తేలిందని అధికారులు తెలిపారు. మిల్లర్ యంగ్​స్టర్ అని, ఆమెకు గతంలో టెస్టులు చేసినప్పుడు వైరస్ లేదని స్పష్టం చేశారు. మిల్లర్ ఈ మధ్య కాలంలో ప్రెసిడెంట్ ట్రంప్ ని సంప్రదించలేదని, కానీ, పెన్స్ ను కలిసినట్లు వెల్లడించారు. వైస్ ప్రెసిడెంట్ మైక్‌ పెన్స్‌కి కరోనా టెస్టులు చేయగా నెగెటివ్‌ వచ్చిందని అధికారులు వెల్లడించారు.
ట్రంప్ సలహాదారుల్లో ఒకరైన స్టీఫెన్ మిల్లర్ భార్య కేటీ మిల్లర్. ఆమె ద్వారా స్టీఫెన్ కు కూడా కరోనా సోకే అవకాశం ఉంది. ప్రస్తుతం.. స్టీఫెన్ వైట్​హౌస్ నుంచి పనిచేస్తున్నాడా లేదా, ఆయనకు టెస్టులు నిర్వహించారా లేదా అనే అంశాలు అధికారులు వెల్లడించలేదు.
‘‘కరోనా సోకిన కేటీ మిల్లర్ వండర్ ఫుల్ యంగ్ లేడీ, ఆమె చాలాకాలం పాటు ఆరోగ్యంగానే ఉన్నారు. ఉన్నట్టుండి ఈరోజు పాజిటివ్ వచ్చింది”అని వైట్ హౌస్ లో కాంగ్రెస్ రిపబ్లికన్ సభ్యులతో జరిగిన సమావేశంలో ట్రంప్ అన్నారు. తాను మిల్లర్ ను ఈ మధ్య కాలంలో కలవలేదని, ఉద్యోగరీత్యా ఆమె పెన్స్ ను తరచూ సంప్రదిస్తుంటారని చెప్పారు.