రాజ్యసభలో 39 ఏళ్లు ప్రతిపక్షాలదే మెజారిటీ..అయినా చట్టాలను అడ్డుకోలే

రాజ్యసభలో 39 ఏళ్లు ప్రతిపక్షాలదే మెజారిటీ..అయినా చట్టాలను అడ్డుకోలే

న్యూఢిల్లీ: ‘రాజ్య సభ చరిత్రలో 39 ఏళ్లు ప్రతిపక్షాలదే పైచేయిగా ఉంది.. మిగతా విషయాల మాటెలా ఉన్నా చట్టాల రూపకల్పనకు ఇదేమీ అడ్డురాలేదు’ అని రాజ్యసభ చైర్మన్​ ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. రాజ్యసభ 68వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం సోషల్​ మీడియాలో ఆయన ఈ వివరాలు పంచుకున్నారు. లోక్​ సభ, రాజ్య సభ లకు ఎన్నికల విధానం వేర్వేరుగా ఉండడంతో ప్రభుత్వానికి లోక్​ సభలో మెజారిటీ ఉంటుంది కానీ రాజ్యసభలో తగినంత సంఖ్యా బలం ఉండదన్నారు. ఏళ్ల తరబడి ఇలాగే జరుగుతోందని వెంకయ్య నాయుడు చెప్పారు. కొన్ని సందర్భాల్లో సభ తన స్వతంత్రను కాపాడుకుందని గుర్తుచేశారు. 1961 లో డౌరీ ప్రొహిబిషన్​ బిల్ 1959, 1978లో ది బ్యాంకింగ్​ సర్వీస్​ కమిషన్​ బిల్ 1977, 2002 లో ది ప్రివెన్షన్​ ఆఫ్​ టెర్రరిజం బిల్​2002 లను రాజ్యసభ రిజెక్ట్ చేసిందన్నారు. రాజ్యసభలో బిల్లులు పాస్​ కావడానికి బాగా ఆలస్యమవుతుందన్న కామెంట్స్ పై స్పందిస్తూ.. అత్యవసరమైన బిల్లుల విషయంలో సభ ఎన్నడూ ఆలస్యం చేయలేదన్నారు. 1994 ఆగస్టు 25న ఒకేరోజు ఐదు రాజ్యాంగ సవరణ బిల్లులను పాస్​ చేసిందని వెంకయ్య నాయుడు గుర్తుచేశారు.

దేశంలో సగం మంది తక్కువ తింటున్నారు