
హైదరాబాద్: సిటీకి చెందిన ఫిన్టెక్ ఎన్బీఎఫ్సీ వివిఫై ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 75 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.623 కోట్లు) సిరీస్ బీ ఫండింగ్ రౌండ్ ద్వారా సేకరించింది. ఈ ఫండింగ్ డెట్, ఈక్విటీల కలయికతో వచ్చిందని సంస్థ తెలిపింది. వివిఫై 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 166 కోట్ల ఆదాయం సంపాదించింది. పన్నుల తర్వాత లాభం (ప్యాట్) రూ. 16 కోట్లు ఉంది. ఈ సంవత్సరం ఆదాయాలు దాదాపు రెట్టింపు అవుతాయని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000 కోట్ల వరకు లోన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూఎస్ ఇన్వెస్టర్ నుంచి ఈ ఫండ్స్ సేకరించింది.