టీటీడీ సలహా కమిటీలో వనపర్తి యువకుడికి చోటు

టీటీడీ సలహా కమిటీలో  వనపర్తి యువకుడికి చోటు

వనపర్తి టౌన్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం సలహాదారు కమిటీ సభ్యుడిగా వనపర్తికి చెందిన అనూప్  చక్రవర్తి నియమితులయ్యారు. పలు స్వచ్ఛంద సంస్థలను నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న అనూప్ చక్రవర్తి కొంత కాలంగా  హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్, కరీంనగర్ లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానాల సలహాదారు కమిటీ సభ్యుడిగా టీటీడీ బోర్డు నియమించింది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగంగా టీటీడీ చేపట్టే కార్యక్రమాల్లో తాను పాల్గొని అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తానని అనూప్​ తెలిపారు. ఆయన నియామకం పట్ల పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.