
ఐపీఎల్ జెర్సీ ధరించి మ్యాచ్ చూస్తే ఆ కిక్ వేరే ఉంటుంది. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో వీటి డిమాండ్ చాలా ఎక్కువ ధరలో ఉంటుంది. చాలా కొద్ది మందికి మాత్రమే జెర్సీ వేసుకునే అవకాశం కలుగుతుంది. జెర్సీ వేసుకోవాలనే ఆశతో కొంతమంది దొంగతనం చేస్తే వారిని సెక్యూరిటీ గార్డు పట్టుకోవడం చూస్తాం. అయితే ఆశ్చర్యకరంగా సెక్యూరిటీ గార్డు ఐపీఎల్ జెర్సీలను దొంగతనం చేయడం సంచలనంగా మారింది. కాపాడాల్సిన సెక్యూరిటీ చోరీ చేయడం షాకింగ్ గా మారుతోంది.
చర్చిగేట్లోని వాంఖడే స్టేడియం దగ్గర బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) కార్యాలయంలోని స్టోర్రూమ్ నుండి గార్డు ఫరూఖ్ అస్లాం ఖాన్ అనే సెక్యూరిటీ గార్డు 261 జెర్సీలను దొంగిలించాడు. వీటి ఖరీదు రూ.6.52 లక్షలు కావడం విశేషం. దొంగతనానికి పాల్పడిన 40 ఏళ్ల వ్యక్తిని వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్ జూద వ్యసనానికి నిధులు సమకూర్చుకోవడానికి ఫరూఖ్ జెర్సీలను విక్రయించాడని పోలీసులు తెలిపారు. జెర్సీలు వేర్వేరు క్రికెట్ జట్లకు చెందినవి అయినప్పటికీ, ఇవి ఆటగాళ్ల కోసమా లేదా సాధారణ ప్రజల కోసమా తెలియాల్సి ఉంది.
మీరా రోడ్లో నివసించే ఆ గార్డు.. సోషల్ మీడియాలో పరిచయం ఉన్న హర్యానా ఆన్లైన్ జెర్సీ డీలర్కు జెర్సీలను విక్రయించాడు. జూన్ 13న జెర్సీలు దొంగిలించబడినప్పటికీ, ఇటీవల ఆడిట్ సమయంలో దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఆ ఆడిట్లో స్టాక్ కనిపించడం లేదని తేలింది. బీసీసీఐ అధికారులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా, సెక్యూరిటీ గార్డు కార్డ్బోర్డ్ పెట్టెను లాక్కుంటూ ఉన్నట్లు గుర్తించారు. ఆన్లైన్ డీలర్తో తాను కొంత బేరసారాలు చేశానని గార్డు చెప్పాడు.
40-year-old security guard Farooque Aslam has been arrested for allegedly stealing 261 jerseys worth Rs 6.52 lakh - each costing around Rs 2,500 -- lifted from a storeroom at the office of BCCI at Wankhede Stadium to fund his online gambling addiction pic.twitter.com/AQaBG2kEYo
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) July 29, 2025