వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి : మాజీ మంత్రి షబ్బీర్ అలీ 

వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి : మాజీ మంత్రి షబ్బీర్ అలీ 
  • రాష్ట్ర  ప్రభుత్వ సలహాదారు, 
  • మాజీ మంత్రి షబ్బీర్ అలీ 

జహీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​లో ప్రవేశపెట్టి ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని  వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర  ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా సైఫుల్లా రెహమాని, కర్నాటక మంత్రి రహీంఖాన్, వివిధ మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం రాత్రి జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు.

కేంద్రం వక్ఫ్ సవరణ చట్టం పేరుతో ఓ నల్ల చట్టాన్ని తీసుకొచ్చి మసీదులు, మదర్సాలు, ఈద్గాలు, శ్మశానవాటికలు వంటి వక్ఫ్ ఆస్తులను ముస్లింల నుంచి లాక్కోవాలని చూస్తుందని ఆరోపించారు. వెంటనే కేంద్రం వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​చేశారు. సభలో మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఐడీసీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్, ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకులు మౌలానా అబూ తాలిబ్, జాఫర్ పాషా, జమాతే ఇస్లామి నాయకులు, ముస్లిం మత పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.