హైదరాబాద్, వెలుగు: రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎలక్షన్ నోటిఫికేషన్ లోపే నగదు బదిలీ స్కీమ్స్ అమలు చేయాలని, లేదంటే ఆ ప్రభావం ఓటర్లపై పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అయితే రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ చూస్తోందని బీఆర్ఎస్ ఫైర్ అయింది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్రానున్న నేపథ్యంలో.. ఆలోపే నగదు బదిలీ స్కీమ్స్ అన్నీ అమలు చేయాలని కాంగ్రెస్డిమాండ్ చేసింది. ఈ మేరకు సెంట్రల్ఎలక్షన్ కమిషన్(సీఈసీ)కు కంప్లయింట్ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రైతుబంధు సహా ఇతర నగదు బదిలీ స్కీమ్స్ అమలు చేస్తే, ఆ ప్రభావం ఓటర్లపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకుని స్కీమ్ ల అమలును నియంత్రించాలని కోరింది. అయితే రైతుబంధు ఆన్గోయింగ్స్కీమ్ అని, దాన్ని నిలిపివేయాలని కోరడమంటే రైతులకు ద్రోహం చేయడమేనని బీఆర్ఎస్నేతలు మండిపడ్డారు.
గ్రామగ్రామాన కాంగ్రెస్దిష్టిబొమ్మలు దహనం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, బీఆర్ఎస్ విమర్శలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్ వేదికగా కేటీఆర్, రేవంత్ రెడ్డి పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
కాంగ్రెస్ను కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ యత్నం..
2018 అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేశారు. అయితే ఆ ప్రభావం పోలింగ్పై పడిందని కాంగ్రెస్నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారీ రైతుబంధు ప్రభావం ఓటర్లపై పడే అవకాశం ఉందని కాంగ్రెస్నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ముఖ్య నేతలు.. సీఈసీని కలిసి రైతుబంధుపై కంప్లయింట్చేశారు. అదను కోసం ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ లీడర్లు.. ఈ కంప్లయింట్ఆధారంగా కాంగ్రెస్పార్టీని కార్నర్చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్రైతు విరోధి అని, ఆ పార్టీ విధానాలను ఎండగట్టాలని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలోనూ ఆందోళనలు చేపట్టాలన్నారు. ట్విట్టర్లోనూ కాంగ్రెస్తీరుపై విరుచుకుపడ్డారు. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ది తప్పుడు ప్రచారం: కాంగ్రెస్
తాము ఇచ్చిన కంప్లయింట్ పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఫైర్ అయింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్నేతలు ఇదే అంశంపై ఏఐసీసీ హెడ్క్వార్టర్స్లో ప్రెస్మీట్పెట్టి బీఆర్ఎస్తీరుపై మండిపడ్డారు. పీసీసీ చీఫ్రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహా కాంగ్రెస్ముఖ్య నేతలంతా బీఆర్ఎస్తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధా లను నిజమని నమ్మించే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతులపై బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే, నవంబర్3వ తేదీలోపే రైతుబంధు జమ చేయాలని సవాల్విసిరారు. ‘‘చేతగానోళ్లే తప్పుడు ప్రచారం చేస్తారు. ఎన్నికల్లో గెలిచేది మా పార్టీనే. మేం గెలిచిన తర్వాత ఇచ్చిన గ్యారంటీ ప్రకారం పెంచిన మొత్తాన్నే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం” అని తెలిపారు.