వరంగల్​ కోటలో ఏర్పాట్ల పరిశీలించిన కలెక్టర్లు

వరంగల్​ కోటలో ఏర్పాట్ల పరిశీలించిన కలెక్టర్లు

హనుమకొండ/ కాశీబుగ్గ/ ఖిలా వరంగల్​(మామునూరు). వెలుగు: ఈ నెల 14న మిస్​వరల్డ్​ కంటిస్టెంట్స్​ వరంగల్​ కోటకు రానున్నందున సోమవారం వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్య, సీపీ సన్​ప్రీత్​సింగ్​ ఏర్పాట్లను పరిశీలించారు. వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

 అనంతరం హరిత కాకతీయలో ఈవెంట్​ మేనేజ్​మెంట్​ సంస్థ షోబోట్​ ప్రతినిధులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించి, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్​సీపీ షేక్​సలీమా, ఏసీపీ నందిరామ్ నాయక్ తదితరులున్నారు. కాగా, కోటలోని శిల్పాలను పురావస్తు శాఖ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు.