
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ర్యాంకింగ్స్లో వరంగల్ పట్టణం దేశంలో 42వ స్థానం, స్టేట్లో 2వ స్థానంలో ఉందని బల్దియా మేయర్ గుండు సుధారాణి తెలిపారు.
హర్యానాలో నిర్వహించిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 53వ వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. వరంగల్ ప్రాముఖ్యతను వివరిస్తూనే, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తెలియజేశారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో మహిళల ఆర్థిక సాధికారతను బలోపేతం చేసేందుకు ఇందిర మహిళా శక్తి పథకాన్ని ఆవిష్కరించినట్లు వివరించారు.