క్రికెటర్లను మరోసారి హెచ్చరించిన బీసీసీఐ

క్రికెటర్లను మరోసారి హెచ్చరించిన బీసీసీఐ

బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ, అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తేలి టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యేలా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు మరవొద్దని, రద్దీ ప్రాంతాలకు అస్సలు వెళ్లొద్దని బీసీసీఐ, మెడికల్​ టీమ్ హెచ్చరించినా  ఇండియా ఆటగాళ్లు పట్టించుకోవడం లేదు. బోర్డు సూచనలను పక్కనబెట్టిన టెస్టు ప్లేయర్లంతా బర్మింగ్​హామ్​లో ఓ హోటల్​కు వెళ్లి లంచ్​ చేశారు.  మాజీ కెప్టెన్​ విరాట్​, పంత్​, శ్రేయస్​, సిరాజ్, గిల్, సైనీ, శార్దూల్​, కమలేశ్.. హోటల్ ​సిబ్బందితో కలిసి గ్రూప్​ ఫొటో దిగారు. మరోవైపు కేఎస్​ భరత్​, జడేజా బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీధుల్లో తిరగ్గా..  కోహ్లీ మరోసారి గుంపుగా ఉన్న ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఫొటో దిగాడు. ఈ ఫొటోలు సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో క్రికెటర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కరోనా ముప్పు ఉన్నప్పటికీ.. ఇంత అజాగ్రత్తగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెటర్లను మరోసారి హెచ్చరిస్తామని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.