
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ ను వరంగల్ జిల్లా కమ్మ సేవా సంఘ సమాఖ్య ప్రతినిథులు ఖండించారు. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ మకేసులు బనాయించారని రాష్ట్రప్రధాన కార్యదర్శి కృష్ణ ప్రసాద్ అన్నారు. సుపరిపాలనతో రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ది చేశారన్నారు, దేశంలో రాజకీయ నేతలకు చంద్రబాబు మార్గర్శిగా ఉన్నారన్నారు. రాజకీయ పార్టీలు హుందాగా రాజకీయాలు చేయాలంటూ... చివరకు న్యాయం ధర్మం గెలుస్తుందన్నారు. రెండు రోజుల్లో చంద్రబాడు అరెస్టుపై నిరసనల కార్యాచరణను రూపొందిస్తామని వరంగల్ జిల్లా కమ్మ సేవా సంఘ సమాఖ్య ప్రతినిథులు తెలిపారు.