సీవ‌‌రేజ్ ట‌‌న్నెలింగ్ ప్రాజెక్టును మూడు నెలల్లో పూర్తిచేయాలి: వాటర్బోర్డు ఎండీ అశోక్ రెడ్డి

సీవ‌‌రేజ్ ట‌‌న్నెలింగ్ ప్రాజెక్టును మూడు నెలల్లో పూర్తిచేయాలి: వాటర్బోర్డు ఎండీ అశోక్ రెడ్డి

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: గ్రేటర్​ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సీవరేజీ టన్నెలింగ్​ ప్రాజెక్టు పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి ఆదేశించారు. 2007లో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని అండర్​గ్రౌండ్​టన్నెలింగ్​ద్వారా నేరుగా అంబర్​పేట ట్రీట్​మెంట్​ప్లాంట్​కు వెళ్లేలా పనులు చేపట్టారు. 

జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు నుంచి నింబోలి అడ్డా వరకు నిర్మించ‌‌తలపెట్టిన ఈ ప్రాజెక్టులో రాజ్‌‌భ‌‌వ‌‌న్‌‌, సచివాల‌‌యం నుంచి అబిడ్స్, హిమాయత్ న‌‌గర్, నారాయణ గూడ, బర్కత్ పురా, బాగ్ లింగం పల్లి ప్రాంతాల్లోని మురుగు నాలాలో కలవకుండా అంబర్ పేట్ ఎస్టీపీకి మళ్లించడానికి ప్లాన్​చేశారు. దాదాపు 5 కిలోమీటర్ల 1800 ఎంఎమ్ డయా భారీ పైప్ లైన్ వేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న మురుగు ఈ టన్నెల్​ ద్వారా అంబర్​పేటకు వెళ్లేలా నిర్మిస్తున్నారు. పూర్తిగా అండర్​ గ్రౌండ్​ టన్నెలింగ్​కావడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. ట్రెంచ్​లెస్​ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టునుఇప్పటివరకు 4.4 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ పనులు పూర్తి చేసింది. 

స్టోన్ ​రావడంతోనే..
భూగర్భంలోని చాలా ప్రాంతాల్లో పరుపుబండ తేలడంతో టన్నెలింగ్ పనులు ఆలస్యం కావడంతో ప్రాజెక్ట్ వ్యయం పెరిగిందంటూ అప్పటి కాంట్రాక్టు సంస్థ తప్పుకుంది. దీంతో 18 ఏండ్లుగా పనులు కొద్దికొద్దిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎండీగా అశోక్​రెడ్డి వచ్చాక పనులు స్పీడప్​చేశారు. మెషినరీతో కాకుండా మాన్యువల్​గా టన్నెలింగ్​ పనులు చేస్తున్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు నుంచి నింబోలి అడ్డా వ‌‌ర‌‌కు జరుగుతున్న పనులను అశోక్​రెడ్డి పరిశీలించారు. పనుల్లో వేగంపెంచి రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాల‌‌ని, అవ‌‌స‌‌ర‌‌మైతే రెండు షిఫ్టుల్లో ప‌‌నులు చేప‌‌ట్టాల‌‌న్నారు.  తర్వాత కాచిగూడ నుంచి రైల్వేస్టేష‌‌న్ వ‌‌ర‌‌కు అధికారుల‌‌తో క‌‌లిసి ప‌‌ర్యటించారు. ప్రాజెక్టు డైరెక్టర్‌‌ సుద‌‌ర్శన్‌‌, ప్రాజెక్టు జీఎం కుమార్ ఇత‌‌ర అధికారులు పాల్గొన్నారు.