
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సీవరేజీ టన్నెలింగ్ ప్రాజెక్టు పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి ఆదేశించారు. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని అండర్గ్రౌండ్టన్నెలింగ్ద్వారా నేరుగా అంబర్పేట ట్రీట్మెంట్ప్లాంట్కు వెళ్లేలా పనులు చేపట్టారు.
జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు నుంచి నింబోలి అడ్డా వరకు నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టులో రాజ్భవన్, సచివాలయం నుంచి అబిడ్స్, హిమాయత్ నగర్, నారాయణ గూడ, బర్కత్ పురా, బాగ్ లింగం పల్లి ప్రాంతాల్లోని మురుగు నాలాలో కలవకుండా అంబర్ పేట్ ఎస్టీపీకి మళ్లించడానికి ప్లాన్చేశారు. దాదాపు 5 కిలోమీటర్ల 1800 ఎంఎమ్ డయా భారీ పైప్ లైన్ వేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న మురుగు ఈ టన్నెల్ ద్వారా అంబర్పేటకు వెళ్లేలా నిర్మిస్తున్నారు. పూర్తిగా అండర్ గ్రౌండ్ టన్నెలింగ్కావడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. ట్రెంచ్లెస్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టునుఇప్పటివరకు 4.4 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ పనులు పూర్తి చేసింది.
స్టోన్ రావడంతోనే..
భూగర్భంలోని చాలా ప్రాంతాల్లో పరుపుబండ తేలడంతో టన్నెలింగ్ పనులు ఆలస్యం కావడంతో ప్రాజెక్ట్ వ్యయం పెరిగిందంటూ అప్పటి కాంట్రాక్టు సంస్థ తప్పుకుంది. దీంతో 18 ఏండ్లుగా పనులు కొద్దికొద్దిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎండీగా అశోక్రెడ్డి వచ్చాక పనులు స్పీడప్చేశారు. మెషినరీతో కాకుండా మాన్యువల్గా టన్నెలింగ్ పనులు చేస్తున్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు నుంచి నింబోలి అడ్డా వరకు జరుగుతున్న పనులను అశోక్రెడ్డి పరిశీలించారు. పనుల్లో వేగంపెంచి రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని, అవసరమైతే రెండు షిఫ్టుల్లో పనులు చేపట్టాలన్నారు. తర్వాత కాచిగూడ నుంచి రైల్వేస్టేషన్ వరకు అధికారులతో కలిసి పర్యటించారు. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ప్రాజెక్టు జీఎం కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.