
ట్యాంక్ బండ్, బషీర్బాగ్, బోట్స్ క్లబ్, నెక్లెస్రోడ్, ఎన్టీఆర్మార్గ్, సికింద్రాబాద్, లిబర్టీ, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో కలిపి మొత్తం122 వాటర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి తెలిపారు. 35 లక్షల వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అవసరమైన చోట్ల డ్రమ్ముల్లోనూ మంచినీరు అందిస్తామని చెప్పారు. ఏరియాకు ఒక రూట్ ఆఫీసర్ను నియమించినట్లు వెల్లడించారు.