మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: నేషనల్ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా నగరంలోని క్రిస్టియన్ పల్లి దగ్గర ఉన్న 1200 ఎంఎం పైప్ లైన్ మార్చుతున్నందున సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు 258 గ్రామాలు, పాలమూరు మునిసిపాలిటీకి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మిషన్ భగీరథ పాలమూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. శ్రీనివాస్ తెలిపారు.
మన్యంకొండ నీటి శుద్దీకరణ ప్లాంట్ నుంచి సరఫరా అయ్యే మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలోని 258 గ్రామాలకు , నారాయణపేట, మక్తల్, దేవరకద్ర మున్సిపాలిటీలకు పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయము కలుగుతుందన్నారు. కావున ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.
