మహిళల ఆరోగ్యానికి ప్రయార్టీ ఇస్తున్నం: ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి

మహిళల ఆరోగ్యానికి ప్రయార్టీ ఇస్తున్నం: ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి

పరిగి, వెలుగు: మహిళల ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయార్టీ ఇస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్​రెడ్డి అన్నారు. స్వస్థ్​నారి సశక్త్​ కార్యక్రమంలో భాగంగా గురువారం పరిగి ప్రభుత్వ దవాఖానలో హెల్త్​ క్యాంప్​ నిర్వహించారు. ఆయన గెస్ట్​గా హాజరై మాట్లాడారు. మహిళలు నెలకు లేదా సంవత్సరానికోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్​వో రవీంద్రనాయక్, ప్రవీణ్​కుమార్, ప్రోగ్రామ్​ హెల్త్​ ఆఫీసర్లు పవిత్ర, జానీ, నిరోషా, శ్రీనివాస్, పరిగి  మున్సిపల్​ కమిషనర్​ వెంకటయ్య పాల్గొన్నారు.

స్పోర్ట్స్​ కోటాలో ఉద్యోగావకాశాలు..

విద్యార్థులు ఆటల్లోనూ రాణించాలని, స్పోర్ట్స్​కోటాలో ఉద్యోగావకాశాలు ఉంటాయని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్​రెడ్డి అన్నారు. గురువారం పరిగి స్కూల్​లో 69వ జోనల్​ స్థాయి అండర్​-14, 17 బాలుర, బాలికల కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇండియా టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహమ్మద్​ సిరాజ్​ ఈ గ్రౌండ్‎లో అనేక టోర్నీలు ఆడారని గుర్తుచేశారు.  ప్రస్తుత ఒత్తడి జీవితంలో ఆటలు ఎంతో అవసరమన్నారు.