అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై..విమానాల తయారీ సంస్థ బోయింగ్ ఏమందంటే..

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై..విమానాల తయారీ సంస్థ బోయింగ్ ఏమందంటే..

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విమానాల తయారీ సంస్థ బోయింగ్ స్పందించింది. ఎయిర్ ఇండియా విమానం AI 171, బోయింగ్ 787--8 డ్రీమ్ లైనర్ ప్రమాదంపై ఎయిర్ ఇండియాతో టచ్లో ఉన్నాం..ఎయిర్ ఇండియా అండగా ఉంటాం..ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతిని ప్రకటించింది బోయింగ్ సంస్థ.

గురువారం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమాన ప్రమాదం తర్వాత బోయింగ్ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది.అమెరికా ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో బోయింగ్ షేర్లు 8శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. ఇది బోయింగ్ సంస్థపై ఒత్తిడిని మరింత పెంచింది. 

గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా 242 మంది చనిపోయారు. విమానం ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో 20 మంది  మెడికోలు చనిపోయారు. మరికొంత మంది స్థానికులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు,10 మంది సిబ్బంది ఉన్నారు. గురువారం (జూన్ 12) మధ్యాహ్నం 1.17 గంటలకు ఎయిర్ ఇండియా విమానం లండన్‌కు బయలుదేరినప్పుడు మేఘనినగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారు. అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలో విమానం కూలిపోయింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కనిపించింది. అగ్ని మాపక దళాలు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుంది.