ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నాం

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నాం
  • హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ జై భీమ్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు హైకోర్టులో పిల్‌ వేసిన విషయం తెలిసిందే. కేసును విచారించగా.. పిటిషనర్ తరపున న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.

పార్టీ రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని గతంలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇకపై భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయమని పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి జి.కె.ద్వివేది హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు.