ఇవాళ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా క్రీడాకారులకు ప్రధాని మోడీ విషెస్ చెప్పారు. నేషనల్ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. హాకీ స్టిక్ తో అతను చేసిన మ్యాజిక్ ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.
ఇవాళ ప్రతిభావంతులైన క్రీడాకారుల విజయానికి వారి కుటుంబాలు, కోచ్ లు ,సిబ్బంది ఇచ్చే సపోర్టును ప్రశంసించే రోజన్నారు. ప్రభుత్వం క్రీడలు ప్రజాధరణ పొందేందుకు,క్రీడా ప్రతిభను గుర్తించేందుకు కృషి చేస్తుందన్నారు. క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన, దేశానికి గర్వకారణంగా నిలిచిన ఆ ఆదర్శ క్రీడాకారులందరి యొక్క అద్భుతమైన విజయాలను జరుపుకునే రోజు జాతీయ క్రీడల దినోత్సవమన్నారు. వారి పట్టుదల, అంకితభావం అమోఘమని కొనియాడారు మోడీ.
అలాగే ప్రతీ ఒక్కరూ కూడా తమ రోజువారీ దినచర్యలో భాగంగా స్పోర్ట్స్ , ఫిట్ నెస్ ఎక్సర్ సైజులు చేయాలని కోరారు మోడీ. ఇలా చేయడం వల్ల చాలా అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారన్నారు.
Today, on #NationalSportsDay, we pay tributes to Major Dhyan Chand, whose magic with the hockey stick can never be forgotten.
This is also a day to laud the outstanding support given by the families, coaches and support staff towards the success of our talented athletes.
— Narendra Modi (@narendramodi) August 29, 2020