వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్

వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఈ నెల 22న అట్టహాసంగా నిర్వహిస్తామని వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే.కేశవరావు తెలిపారు. కేశవరావు అధ్యక్షతన కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 8 నుంచి చేపడుతోన్న స్వాతంత్య్ర వజ్రోత్సవాల కార్యక్రమాలన్నింటినీ ప్రజాప్రతినిధులు, అధికారులు విజయవంతంగా నిర్వహిస్తున్నారంటూ అభినందించారు. ఈనెల 21న పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 

ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో జరిగే ముగింపు ఉత్సవాలకు సీఎం కేసీఆర్ హాజరవుతారని కేకే వెల్లడించారు. శంకర్ మహదేవన్, శివమణి డ్రమ్స్ తెలంగాణ జానపద కార్యక్రమాలు, లేజర్ షో ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ దేశ స్వతంత్ర పోరాటం, దేశభక్తి ప్రధానంగా ఉంటాయని వెల్లడించారు. ఈ ముగింపు కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి దాదాపు 20 వేలకుపైగా హాజరవుతారని తెలిపారు.