న్యూఢిల్లీ: ట్విటర్లో బ్లూటిక్లకు ఇక నుంచి చార్జ్ చేస్తామని సంస్థ బాస్ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్కు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) స్పందించింది. నెలవారీ చెల్లింపుల కోసం డెవలప్ చేసిన తమ యూపీఐ ఆటోపే ఆఫర్ను వాడుకోవాలని సూచించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బే ..మస్క్ చేసిన ట్వీట్కు సమాధానమిస్తూ, యూపీఐ రికరింగ్ పేమెంట్స్ ఆఫర్కు ఇప్పటికే 70 లక్షల మంది కస్టమర్లు ఉన్నారని చెప్పారు.
‘‘బాధపడొద్దు! ప్రతిసారీ/నెల/క్వార్టర్ లేదా వార్షికంగా డబ్బులు వసూలు చేయడానికి యూపీఐ ఆటోపే ఉంది" అని అస్బే సరదాగా ట్వీట్చేశారు. ట్విటర్ చాలా సంవత్సరాలుగా పబ్లిక్ ఫిగర్స్కు ఫ్రీగా 'బ్లూ టిక్' ఇస్తోంది. ఇప్పుడు చార్జ్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.