సమగ్ర కులగణన చేయకపోతే ఆమరణ దీక్షలు

సమగ్ర కులగణన చేయకపోతే ఆమరణ దీక్షలు

తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు  అశోక్

ఓయూ, వెలుగు : కాంగ్రెస్  ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం సమగ్ర కులగణన చేయాలని   తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు  బారి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద  మీడియాతో మాట్లాడారు..  ఏ ప్రభుత్వం వచ్చినా.. ఉద్ధేశపూర్వకంగానె బీసీలను అన్ని రంగాల్లో వెనుకటుకు గురిచేస్తున్నాయిని, దీనికి తోడు  ఈడబ్ల్యూఎస్​  రిజర్వేషన్ల వల్ల  బీసీలే  తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా  స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా రిజర్వేషన్లతో పాటు కామారెడ్డి డిక్లరేషన్​ను అమలు చేయకపోతే  ఆర్ట్స్ కాలేజ్ వేదిక ఆమరణ దీక్షలకు దిగుతామని , మరో తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్రిక్త పరిస్థితులను ఏదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.  ఈ సమావేశంలో  టీఎస్​పీ  నాయకులు  నూకల మధు యాదవ్, బీసీ సంఘం నేత పవన్ వర్మ, తెరిసా, మహేశ్​ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.