
న్యూఢిల్లీ: టెర్రరిజానికి వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న పోరాటానికి అమెరికా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. పహల్గాం టెర్రర్ అటాక్తో ఇండియా, పాక్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియా టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడా లి.
మద్దతు ఇవ్వడానికి మేం సాధ్యమై నంత సహాయం చేస్తాం. భారత్కు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అవసరమైన సాయం అందిస్తుంది. ఇండియాతో సంబంధాలు మాకు చాలా కీలకం. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న పోరాటానికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తాం” అని మైక్ జాన్సన్ పేర్కొన్నారు.