
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్స్ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్ శివసేనా రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్లోని రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ను అకస్మికంగా తనిఖీ చేశారు.
హాస్టల్ గదలు, క్లాస్ రూమ్స్, కిచెన్ను పరిశీలించారు. స్టూడెంట్లకు అందించే ఆహారం బాగా లేకపోవడంతో మెస్ కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్న స్టూడెంట్లకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
స్పోర్ట్స్ అకాడమీలు, స్కూళ్లలో మెరుగైన క్రీడా సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి జిల్లా కలెక్టర్ల సమన్వయంతో స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తుందని శివసేనా రెడ్డి వివరించారు.