
కరోనా వైరస్ను పూర్తిగా అంతం చేయలేమని స్పష్టం చేశారు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్. ముఖ్యంగా ఈ టైంలో వైరస్ మరోసారి విజృంభిస్తే.. బ్రిటన్ లో కంటైన్మెంట్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. లాక్ డౌన్ నిబంధనలను సడలించినా… రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కరోనాతో కలిసి జీవించడాన్ని మనమంతా నేర్చుకోవాలని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ… కరోనా ప్రభావం వచ్చే ఏడాది మధ్య వరకు ఉంటుందని చెప్పారు బ్రిటన్ ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్. రాబోయే కాలంలో మరింత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గతంలో మనకు తెలియని జీవితో ప్రస్తుతం మనం యుద్ధం చేస్తున్నామని చెప్పారు.