కేసీఆర్ ఛాలెంజ్: పనులు పూర్తి చేయకపోతే ఓట్లు అడగం

కేసీఆర్ ఛాలెంజ్: పనులు పూర్తి చేయకపోతే ఓట్లు అడగం

నల్గొండ జిల్లా నెల్లికల్లులో ఇవాళ తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను ఏడాదిన్నర లోపు పూర్తి చేయకపోతే…వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమన్నారు సీఏం కేసీఆర్. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రెండున్నర వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ అంటే వీరుల పార్టీ…వీపు చూపించే పార్టీ కాదన్నారు. కృష్ణా,గోదావరి అనుసంధానం చేసి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. కృష్ణా నీళ్లు రాకపోతే సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలిస్తామన్నారు సీఎం కేసీఆర్.

మరోవైపు కాంగ్రెస్,బీజేపీ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.