భూమి ఇచ్చేదాకా ఆందోళన విరమించం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనుల రాస్తారోకో .. కలెక్టరేట్కు పాదయాత్ర

భూమి ఇచ్చేదాకా ఆందోళన విరమించం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనుల రాస్తారోకో .. కలెక్టరేట్కు పాదయాత్ర

 అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గిరిజనులు తమ భూమి అప్పగించాలని చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరింది. ఎఫ్ డీఓ దామోదర్ రెడ్డి, తహసీల్దార్ రామకృష్ణ.. ఫారెస్ట్  రేంజ్ ఆఫీసులో గిరిజనులతో చర్చలు జరిపారు. 

ఓల్డ్ రికార్డులు కాకుండా ప్రస్తుత రికార్డులు ఏమైనా ఉంటే వాటిని తీసుకురావాలని, అవి లేకపోతే తామేమి చేయలేమని ఆఫీసర్లు చెప్పడంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.  

పోలీసులు వెళ్లి  నచ్చజెప్పి రాస్తారోకో విరమింప చేశారు. తమ సమస్యపై కొత్తగూడెం కలెక్టరేట్ కు  పాదయాత్రగా  వెళ్లి  నిరాహార దీక్ష చేపడతామని గిరిజనులు స్పష్టం చేశారు. తమ భూమి రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే చేసి అప్పగించే వరకు ఆందోళన విరమించమని గ్రామస్తులు తేల్చిచెప్పారు.