- అవసరమైతే ఆరో రోజు!
- డబ్ల్యూటీసీ ఫైనల్ ప్లేయింగ్ కండిషన్స్పై ఐసీసీ కసరత్తు
- ఎలాగైనా విన్నర్ను తేల్చాలని భావిస్తున్న కౌన్సిల్
- ఈ వారంలో ప్లేయింగ్ రూల్స్ వెలువడే చాన్స్
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ మెగా ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే విన్నర్ ఎవరు? వర్షం వల్ల ఒకట్రెండు రోజుల ఆటను కోల్పోతే పరిస్థితేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది. రిజర్వ్ డే ఉంటుందని ఇదివరకే ప్రకటించినా.. తాజాగా ఈ క్లాజ్ను తన వైబ్సైట్ నుంచి తొలగించడంతో సందిగ్ధం నెలకొంది. అయితే, ప్రతికూల వాతావరణం, స్లో ఓవర్ రేట్ కారణంగా ఐదు రోజుల్లో నిర్ణీత ఓవర్లు పూర్తి కాకపోతే ఆటను ఆరో రోజుకు పొడిగించే విషయంపై ఐసీసీ ఆలోచన చేస్తోందని సమాచారం. ఈ మేరకు ఇండియా–న్యూజిలాండ్ మధ్య సౌతాంప్టన్లో జరిగే ఈ మెగా ఫైనల్ ప్లేయింగ్ కండిషన్స్పై ఈ వారంలో ఐసీసీ క్లారిటీ ఇవ్వనుంది. అంతేకాక డబ్ల్యూటీసీ భవితవ్యంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ కనిపిస్తోంది.
దుబాయ్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫస్ట్ ఎడిషన్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దృష్టి సారించింది. కరోనా దెబ్బకు డబ్ల్యూటీసీ లీగ్స్టేజ్ మ్యాచ్ల షెడ్యూల్లో మార్పులు జరిగాయి. దాంతో ఫైనలిస్టులను తేల్చేందుకు పాయింట్స్ పర్సంటేజ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. దాని ప్రకారం టేబుల్ టాపర్స్గా నిలిచిన ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్కు చేరాయి. సౌతాంప్టన్ వేదికగా జూన్18–22 మధ్య జరిగే టైటిల్ ఫైట్లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. డబ్ల్యూటీసీ తొలి ఎడిషన్ కావడంతో ఫైనల్ మ్యాచ్లో కచ్చితంగా రిజల్ట్ తేలాలని ఐసీసీ కోరుకుంటోంది. ఏ కారణం వల్ల ఆటను కోల్పోయి మ్యాచ్ డ్రా గా ముగియకూడదని చూస్తోంది. ఈ మేరకు తొలి ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ ప్లేయింగ్ కండిషన్స్పై ఇంటర్నేషనల్ బాడీ కసరత్తు చేస్తోంది. ఈ వీకెండ్లోగా ఇరు జట్లకు రూల్స్, రెగ్యులేషన్స్ను అందించే చాన్స్ కనిపిస్తుంది. అయితే, ఒకవేళ మెగా ఫైనల్ డ్రా గా ముగిస్తే విజేతగా ఎవరిని ప్రకటిస్తారనే అంశంపై కన్ఫ్యూజన్ఉన్న సంగతి తెలిసిందే. దీనికి పరిష్కారంగా మ్యాచ్కు ఓ రిజర్వ్ డే కేటాయించాలని డబ్ల్యూటీసీని క్రియేట్ చేసినప్పుడే ఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్(ఎఫ్ఏక్యూ)లో రిజర్వ్ డేను చేర్చింది. కానీ, ఇప్పుడా క్లాజ్ను ఐసీసీ తమ వెబ్సైట్ నుంచి తొలగించింది. ఇదికాక, మ్యాచ్ డ్రా అయితే ఇరుజట్లను జాయింట్ విన్నర్స్గా ప్రకటించాలని కూడా ఐసీసీ తొలుత భావించింది. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్కు సంబంధించి ముందుగా అనుకున్న ప్లాన్స్ ప్రకారం రిజర్వ్డేకే ఐసీసీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. నిర్ణీత ఐదు రోజుల్లో ప్లేయింగ్అవర్స్కు ఆటంకం ఏర్పడితే వాటిని అదనంగా కేటాయించిన ఆరో రోజు కంప్లీట్ చేయాలని చూస్తోంది. ‘సాధారణంగా మ్యాచ్జరిగే ఐదు రోజుల్లోనే 30 గంటల ఆట పూర్తి చేయాలనేది మా లక్ష్యం. అయితే, ఏ కారణం వల్లనైనా ఆ 30 గంటలు కంప్లీట్చెయ్యలేకపోతే ఆరో రోజున మిగిలిన ఆట ఆడించాలని అనుకుంటున్నాం. దానివల్ల మ్యాచ్ రిజల్ట్పై వాతావరణం ప్రభావాన్ని చాలావరకు తగ్గించొచ్చు’ అని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్లేయింగ్అవర్స్ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఐసీసీకి మరికొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్లేయింగ్అవర్స్ప్రాతిపదిక అయితే అప్పుడు స్లో ఓవర్ రేట్అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇటీవల కాలంలో స్లో ఓవర్ రేట్అనేది మ్యాచ్ల్లో సాధారణంగా మారింది. రూల్స్ ప్రకారం రోజుకు 90 చొప్పున ఐదు రోజుల మ్యాచ్లో గరిష్టంగా 450 ఓవర్లు పడాలి. ఉదాహరణకు రెండో రోజు ఆటలో ఏడు ఓవర్లు తక్కువ పడితే వాటిని థర్డ్ డే కోటాలో పూర్తి చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో స్లో ఓవర్ రేట్కు పెద్దగా ప్రాధాన్యముండదు. అదే వర్షం ఆటంకం కలిగించి ఒక రోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోతే మాత్రం అవస్థలు తప్పవు. వర్షం వల్ల ఒకట్రెండు సెషన్లు లేదా ఒక రోజు ఆటను కోల్పోతే రిజర్వ్ డేలో కంప్లీట్చెయ్యవచ్చు. కానీ రెండు రోజుల ఆట నష్టపోతే ఇంటర్నేషనల్ బాడీ ఏం చేస్తుందో చూడాలి.
జాయింట్ విన్నర్స్పై నో ఇంట్రస్ట్
డబ్ల్యూటీసీ ఫస్ట్ఎడిషన్కావడంతో జాయింట్ విన్నర్స్ కాన్సెప్ట్పై ఐసీసీ అంతగా ఆసక్తి చూపడం లేదు. కచ్చితంగా మ్యాచ్విన్నర్ ఉండాలనే చూస్తున్నది. ‘డబ్ల్యూటీసీ ఫస్ట్ ఎడిషన్ కావడం వల్ల జాయింట్ విన్నర్స్ కాన్సెప్ట్పై పెద్దగా ఆసక్తి లేదు. మ్యాచ్రిజల్ట్తేలేందుకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనిపై ఐసీసీ కమిటీ వర్క్చేస్తుంది. ఈ వారంలో ప్లేయింగ్కండిషన్స్వెలువడే అవకాశం ఉంది’అని ఐసీసీ కి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.
డబ్ల్యూటీసీ కొనసాగింపు కష్టమే!
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ భవితవ్యంపై ఐసీసీలో ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్ల్యూటీసీని కొనసాగించే అవకాశం కనిపించడం లేదు. జూన్ 1న జరగబోయే ఐసీసీ బోర్డు మీటింగ్లో డబ్ల్యూటీసీ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నిజానికి, 2019లో డబ్ల్యూటీసీని ప్రకటించనప్పుడే 2021–23 సీజన్ కూడా ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. అంతేకాక మిగిలిన ఐసీసీ టోర్నీల మాదిరిగానే డబ్ల్యూటీసీ కొనసాగుతుందని పేర్కొంది. అయితే, త్వరలో ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. 2021–23 సీజన్లో ఇండియాకు ఇది తొలి సిరీస్ కాగా, డబ్ల్యూటీసీ సెకండ్ ఎడిషన్పై ఐసీసీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అంతేకాక డబ్ల్యూటీసీ కొనసాగింపునకు ఐసీసీ బోర్డు సభ్యుల్లో చాలా మంది ఇంట్రస్ట్ చూపడం లేదు.
క్వారంటైన్లోనూ కసరత్తులు
మూడు నెలలకుపైగా సాగే యూకే టూర్ కోసం ముంబై చేరుకున్న టీమిండియా క్రికెటర్లు ముంబైలోని ఓ హోటల్లో హార్డ్ క్వారంటైన్లో ఉన్నప్పటికీ తమ ఫిట్నెస్ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. బయోబబుల్లో ప్రత్యేక జాగ్రత్తలతో ఏర్పాటు చేసిన జిమ్లో క్రికెటర్లంతా చెమటోడ్చారు. ఇందుకు సంబంధించి బీసీసీఐ బుధవారం ఓ వీడియోను రిలీజ్ చేసింది. వైస్ కెప్టెన్ అజింక్యా రహానె, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ తదితరులు రకరకాల ఎక్సర్సైజ్లు చేయడం ఆ వీడియోలో కనిపించింది. ఫిట్నెస్ ట్రెయినింగ్కు సంబంధించి పంత్ కూడా ఓ వీడియో పోస్ట్ చేశాడు. తనలోని అథ్లెటిక్ ఎబిలిటీస్ పెంచుకునేందుకు స్పెషల్ వర్కౌట్స్ చేస్తూ కనిపించాడు. ముఖ్యంగా బాడీని పూర్తిగా వెనక్కు వంచిన పంత్ వహ్వా అనిపించాడు.