
- చీఫ్ గెస్ట్గా మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, వెలుగు : ఆత్మీయ వేడుకలకు తెలంగాణ గమ్యస్థానమని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనాన్ని హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ నదిని థేమ్స్నదిలా తీర్చదిద్దుతామని ప్రకటించారు. సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ మూడో ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణకు గర్వకారణమన్నారు. తెలంగాణ టూరిజం, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఐఐ) ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ 3వ ఎడిషన్, 3వ టీసీఐఐ ఎస్ఐడబ్ల్యూపీసీ గ్లోబల్ 2024 బియాండ్ ఇమాజినేషన్, 7వ టీసీఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024 వేడుకలు జరిగాయి.